Headlines in Telugu:
-
కోరుట్లలో స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ ఉచిత వైద్య శిబిరం
-
వైద్య శిబిరంలో 80 మందికి ఉచిత వైద్య పరీక్షలు – డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యం
-
వైద్య సేవల శిబిరం ప్రారంభించిన స్థానిక సిఐ సురేష్ బాబు
-
కోరుట్లలో సామాజిక సేవా కార్యక్రమంగా ఉచిత వైద్య శిబిరం
-
స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ ద్వారా 80 మందికి వైద్య సేవలు
స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ సౌజన్యంతో కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ భవనం ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక్ సిఐ సురేష్ బాబు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కోరుట్ల సురేఖ వర్సింగ్ హోమ్ వైద్యులు కీర్తిశేషులు డాక్టర్ విజయకుమార్ కుమారులు డాక్టర్ ఎం.శ్రీకాంత్ (ఎంఎస్ జనరల్ యూరియాలజీ), డాక్టర్ ఎం.సోమేశ్వర్ (ఎండి జనరల్ మెడిసిన్ ఫిజీషియన్) లు. సుమారు 80 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాపభూమయ్య, ఉపాధ్యక్షులు రుద్ర వాగరాజు, శ్యామ్ సుందర్, రాజశేఖర్, రాచకొండ పెద్ద దేవన్న, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, సామాజిక వేత్త కటుకం గణేష్, న్యాయవాది బోయిని సత్యనారాయణ, సురేఖ నర్సింగ్ హోమ్ సిబ్బంది పొల్గొన్నారు.