జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

*జన వికాస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన*

*జమ్మికుంట నవంబర్ 9 ప్రశ్న ఆయుధం*

జనవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ సౌజన్యంతో జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లిలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని లక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ నిక్కత్,డాక్టర్ తేజస్విని 160 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం జనవికాస స్వచ్ఛంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన డాక్టర్ నిక్కత్, డాక్టర్ తేజస్విని లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని నీటిని మురికి గుంటల్లో నిలువ ఉంచరాదని ప్లాస్టిక్ పైపు ముక్కలను చెత్తాచెదారాన్ని ప్లాస్టిక్ బాటిల్లను మురికి కాలువల్లో వేయరాదని గ్రామస్తులకు సూచించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్, పి ఆర్ ఓ సుభాష్, రాజేష్, సిస్టర్లు ప్రసన్న, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now