పినపాక శాసనసభ్యులు పాయంకు
ఏరియా జిఎం దుర్గం రామచందర్ కు
*
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సేవలను గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ కార్మికులు
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వార్షిక లాభాలలో భాగస్వాములు చేస్తూ వారికి కూడా ఐదువేల రూపాయలు ప్రత్యేక ప్రోత్సాహక బోనస్ చెల్లించడం మరియు ప్రభుత్వ మరియు సిఎండి ఎం బలరాం (ఐఆర్ఎస్) ఆదేశాల మేరకు శుక్రవారం నాడు వివిధ గనులు డిపార్ట్మెంట్ లలో యాజమాన్యం ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనాలకు పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఆహ్వానించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం పీకే ఓసి సెక్షన్ 2 కార్యాలయంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన సహా పంక్తి భోజనాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని ఏరియా జి ఎం దుర్గం రామచందర్ని కాంట్రాక్ట్ కార్మికులు శాలువా పుష్పగుచ్చం, బుద్ధుని చిత్రపటంతో ఆత్మీయ సత్కారం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై యాజమాన్యంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ సామాజిక కార్యకర్త అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు రవాణా, అన్ని విభాగాలలో సైతం పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా ఆనిర్వచనీయమని ఇంతకాలం సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ తమ సేవలను గుర్తించలేదనే ఒకింత అసంతృప్తి ఉండేదని కానీ ప్రమాద బీమా ముప్పయి లక్షల రూపాయల వర్తింపు, లాభాలలో ఐదువేల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి, వివిధ గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులను ఆహ్వానించి సహా పంక్తి భోజనాలలో గౌరవ శాసనసభ్యులు ఏరియా జిఎం తోపాటు అధికారులు సూపర్వైజర్లు పర్మినెంట్ కార్మికులతో పాటుగా కలిసి భోజనం చేసే అవకాశాన్ని కల్పించడం తమకెంతగానో సంతోషం కలిగించిందని తమ వంతు కర్తవ్యం గా గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుని ఏరియా ప్రధాన అధికారి అయిన జిఎం దుర్గం రామచందర్ ని శాలువా పుష్పగుచ్చంతో ఆత్మీయ సత్కారం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామని తెలిపారు, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి అనునిత్యం తమకోసం ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్న కార్మిక సంఘాలకు, తమకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న సింగరేణి కార్మికులకు,కేంద్ర కార్మిక శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే దసరా నాటికి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఓబి వర్కర్లకు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు ప్రైవేటు వాహన డ్రైవర్లకు , సింగరేణి సోలార్ విద్యుత్ ప్లాంట్ కాంటాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ కమిటీ వేతనాలు అమలు అయ్యేవిధంగా తగు చర్యలు చేపట్టాలని వేదికపై శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని ఏరియా జిఎం ని ఇతర అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్,ఏఐటీయూసీ నాయకులు వై రాంగోపాల్, ఐ ఎన్ టి యు సి నాయకులు వత్సవాయి కృష్ణంరాజు,సిల్వేరు గట్టయ్య,కాంట్రాక్ట్ కార్మికులు ఉప్పల శివ రామకృష్ణ, రావులపల్లి ముత్తమ్మ, కొప్పుల సీత,కళావతి, కుమారి, కలమ్మ, రమణ,శ్రీనివాస్, కస్నా, ప్రసాద్, నాగేశ్వరరావు, తిరుపతి ,రాజు ,మహర్షి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.