మాదకద్రవ్యాల దుర్వినియోగం – అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ.
– సి ఎస్ ఐ చర్చి గ్రౌండ్ నుంచి కళాభారతి దాకా… మత్తు విముక్తికి ర్యాలీ
– మత్తు విముక్తికి సమిష్టి పోరాటం
– ప్రశ్న ఆయుధం కామారెడ్డి
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, జూన్ 26, 2025 (గురువారం) ఉదయం 9:00 గంటలకు, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చి గ్రౌండ్ నుంచి కళాభారతి వరకు “మత్తు విముక్తికి ర్యాలీ” నిర్వహించబడుతోందనీ జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయనీ, వాటి దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు. చిన్న, పెద్ద, యువతి, యువకులు, విద్యార్థిని విద్యార్థులు, పెద్దలు అందరూ చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని తెలిపారు.
ఈ ర్యాలీ ద్వారా మత్తు పదార్థాలపై ప్రజల్లో అవగాహన పెరిగి, మత్తు వ్యసనానికి వ్యతిరేకంగా గట్టి సంకల్పంతో సమాజాన్ని ముందుకు నడిపే ప్రయత్నంగా జిల్లా పోలీస్ శాఖ భావిస్తోందన్నారు. ఆరోగ్యకరమైన, మత్తు రహిత సమాజం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జిల్లా ప్రజలను కోరుతున్నాం అన్నారు.