Site icon PRASHNA AYUDHAM

శ్రీ విద్యాభ్యాస పాఠశాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి భానుమతి

IMG 20250122 WA0325

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి భానుమతి బుధవారం సాయంత్రం మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాల వెలుగు) పాఠశాలను సందర్శించారు. విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి కల్పిస్తున్న వసతి సౌకర్యం, చదువు, క్రీడలు కళల పట్ల ఆమె ఎంతో ఆసక్తిగా నిర్వాహకులు బి జగన్ మోహన్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారు. గత 13 సంవత్సరాలుగా వలస గొత్తి కోయల, నిరుపేద గిరిజనుల, బాల కార్మికులను చేరదీసి సుమారు 1450 మందిని అక్షరాస్తులుగా తీర్చిదిద్దామని, ప్రవేశ పరీక్ష ద్వారా గురుకుల పాఠశాలలో చేర్పించామని ఈ అక్షర యాగంలో మణుగూరు ఏరియా సింగరేణి యాజమాన్యం ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని ఆమెకు వివరించారు. పాఠశాలకు సొంత భవనం లేని కారణంగా అద్దె వసతి గృహంలో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ సహకారాన్ని పాఠశాల నిర్వాహకులు మేడమ్ కి వివరించారు. మేడం కూడా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ (ఐఏఎస్) కి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పాఠశాలకు తగు పాఠశాల నిర్మాణానికి భూమి మరియు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. న్యాయ సలహా కోసం తమను సంప్రదించాలని కోరారు, ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ నృత్యం పలువురు న్యాయవాదులు అధికారులు సామాజిక కార్యకర్తలతో కలిసి ఆమె వీక్షించారు. ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను, నృత్య దర్శకురాలు చంద్రకళను ఆమె ఎంతగానో అభినందిస్తూ ప్రోత్సహించారు, నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పాటుపడుతున్న పాఠశాల నిర్వాహకులను సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ న్యాయవాది నిరంజన్ రావు, మణుగూరు లీగల ఎయిడ్ న్యాయవాది అంకం సర్వేశ్వరరావు, న్యాయవాది కె విజయ్, నాగేంద్రబాబు,పి ఎల్ వి షేక్ షాహీన్, బాడిస బిక్షం, మూత్రధారపు జానకిరామ్, గుండెబోయిన రామకృష్ణ, సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, పి కిరణ్,సిబ్బంది సుహాసిని దేవి, చంద్రకళ, స్వాతి, రాధా, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version