Site icon PRASHNA AYUDHAM

అమ్మవారి దయ, కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి….గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 

IMG 20250422 WA2668

అమ్మవారి దయ, కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి….గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22: శేరిలింగంపల్లి ప్రతినిధి

నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోనీ శ్రీ శ్రీ కోమటికుంట కట్ట మైసమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. .ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు .అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని వేడుకున్నానని తెలిపారు.

గ్రామ దేవతలను పూజించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో భాగమని అన్ని అన్నారు.అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం లో పాల్గొనడం అదృష్టకరం అన్నారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గర్,తాజ్ నగర్,సోఫా కాలనీ సొసైటీ అధ్యక్షులు విఠల్ ,సీనియర్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి, కృష్ణ, మహేష్, సుమన్,శ్రీకాంత్, రామ్ రెడ్డి , నవీన్, ధనుజయ్ ,ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్,సోఫా కాలనీ వాసులు,భక్తులు,పిల్లలు, సీనియర్ నాయకులు,డివిజన్ నాయకులు,స్థానిక నేతలు, కార్యకర్తలు,పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version