Headlines :
-
గజ్వేల్ మున్సిపల్ కార్మికుల వేతనాల కటింగ్ పై సిఐటియు నిరసన
-
మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా: శానిటేషన్ కార్మికుల వేతనాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్
-
గజ్వేల్ మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చ, సమస్య పరిష్కరణపై హామీ
మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు
సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్ డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల వేతనాలు కటింగ్ చేసి వేయడంతో విధులను బహిష్కరించి పాత మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి గేటు ముందు బైటాయింపు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు సంద బోయిన ఎల్లయ్య మాట్లాడుతూ డ్యూటీ కి రాలేదని కారణంతో కటింగ్ చేసిన వేతనాలు వెంటనే ఇవ్వాలని కార్మికులకు వారాంతపు సెలవులు, జాతీయ, పండుగ, క్యాజువల్, సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ డ్రెస్సులు నూనె సబ్బులు చీపురు కట్టలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శానిటైన్స్పెక్టర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి రవీందర్ తో మాట్లాడించటం జరిగింది. కార్మికులందరికీ వారాంతపు సెలవులు ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది మున్సిపల్ కార్యాలయం వద్దకు మున్సిపల్ చైర్మన్ వచ్చి మరియు కటింగ్ చేసిన వేతనాలు, డ్రెస్సులు సబ్బులు చీపురు కట్టలు ఇతర సమస్యలపై కమిషనర్ తో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదగిరి కుమార్ స్వామి నర్సింలు బాలయ్య ఇతరులు పాల్గొన్నారు.