గ్రామ దేవతలకు గంగనీళ్లు
నిజామాబాద్ ఫిబ్రవరి 02
పట్టణంలోని కోటార్మూర్ వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు గంగనీళ్లు పోసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, శేఖర్ రెడ్డి, 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.