Headlines:
-
“గణిత ప్రతిభ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ బహుమతులు”
-
“హుజురాబాద్లో గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహం”
-
“70 మంది విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలో బహుమతులు”
-
“హుజురాబాద్ గురుకుల పాఠశాలలో గణిత ప్రతిభ బహుమతి కార్యక్రమం”
-
“గణిత టీచర్ గంగిశెట్టి జగదీశ్వర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానం”
*హుజురాబాద్ నవంబర్ 18 ప్రశ్న ఆయుధం*
సోమవారము రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించిన గణిత ప్రతిభ టెస్టులో ప్రతిభ కనబరిచిన పదవ తరగతి విద్యార్థులకు బహుమతి మెమొంటో ప్రధానం చేశారు హుజరాబాద్ పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతి పూలే వెనుకబడిన తెగల బాలుర గురుకుల పాఠశాల లో (సైదాపూర్ శాఖ)10వ తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ గణిత టీచర్) నిర్వహించి బహుమతులను ప్రిన్సిపాల్ అక్యారపు రాణి హుజురాబాద్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు మెమొంటోను అందజేశారు మొదటి బహుమతిగా వి అజయ్ కు బహుమానం మెమొంటో ద్వితీయ బహుమతిగా యు శివకుమార్ కు బహుమానం మెమొంటో అందజేశారు కార్యక్రమంలో గణిత అధ్యాపకులు టి.రాజు నరేష్ ఉదయ్ శ్రీధర్ సదయ్య ఆర్ సంతోష్ రాజేందర్,వీరుష మహిళా అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.