గతిలేని కామారెడ్డి మాజీ  ఎమ్మెల్యే కు, మతిలేని కాంగ్రెస్ నాయకులు మద్దతు..

కామారెడ్డి లో అధికార, ప్రతిపక్ష పార్టీల వింత రాజకీయం…

 

IMG 20240817 WA01091

.

కామారెడ్డి మున్సిపాలిటీ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ చేతిలో పెట్టినందుకు కృతజ్ఞత గా మాజీ ఎమ్మెల్యే కు రుణ మాఫీ చేశారేమో.. అలాగే కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని జయ శంకర్ కాలనీ దగ్గరలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మాజీ ఎమ్మెల్యే అతని ప్రధాన అనుచరుడి వెంచర్ లో మున్సిపల్ సాదారణ నిధులతో విద్యుత్ స్థంబాలు వేయుటకు మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్ లు కొందరు బి ఆర్ఎస్ కౌన్సిలర్ లు తీర్మానం చేసి ఆమోదం కూడా పొందడం జరిగింది… పనులు ప్రారంబానికి కూడా సిద్ధంగా ఉన్నాయి… ఇందులో అధికార కాంగ్రెస్లోని ప్రధాన నేతకు, మరియు బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఒక నాయకుని కి ప్రతిపక్ష బి ఆర్ ఎస్ లోని ఇద్దరు ప్రధాన నాయకులు వాటాలు ఇవ్వడం జరిగిందని పట్టణ రాజకీయ వర్గాల ఇన్సైడ్ టాక్.. సదురు మాజీ ఎమ్మెల్యే కు తినడానికి తిండి కూడా గతి లేదు. వేసుకోవడానికి బట్టలు లేక చిరిగిన దుస్తులు, ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేక రైల్వే స్టేషన్ రోడ్డు ప్రక్కన షాపు ల ముందు తల దాచుకుంటున్నాడు కాబోలు, అందుకే ఈ గతి లేని మాజీ ఎమ్మెల్యే దుస్థితి చూసి చలించిపోయిన ఈ కాంగ్రెసొళ్లు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు రుణ మాఫీ తో పాటు, కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో వేసిన మాజీ ఎమ్మెల్యే వెంచర్ లో ప్రజా ధనంతో(మున్సిపల్ సాధారణ నిధులతో పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు పోస్టులు వైరల్ గా మారాయి.కామారెడ్డి ని అవినీతి రహిత నియోజకవర్గం గా తీర్చి దిద్దడమే తన లక్ష్యం అని, అవినీతి జరిగిన చోట ప్రత్యక్షమవుతా, ఏ ఒక్క అవినీతి పరుడిని వదిలే ప్రసక్తి లేదని చెప్పుకునే ప్రస్తుత ఎమ్మెల్యే ఇవన్నీ చూస్తూ కూడా ఎందుకో ఈ మధ్య సైలెంట్ అయిపోయారు.. అధికార కాంగ్రెస్ (మాజీ మంత్రి ), ప్రతి పక్ష బి ఆర్ ఎస్ (మాజీ ఎమ్మెల్యే) ఆడే ఆటలో అరటిపండు లాగ ప్రస్తుత ఎమ్మెల్యే పరిస్థితి ఉన్నట్టు నియోజకవర్గ ప్రజలు పలు రకాలుగా చర్చికుంటున్నారు.. ఆ రెండు పార్టీల ఆటలో అరటిపండా లేక వాళ్ళ వాటల్లో మేడిపండా అని ప్రజలు అనుమానిస్తున్నారు… గెలవక ముందు కాటిపల్లి అని చెప్పుకున్న వాళ్ళే ఎమ్మెల్యే గా గెలిచాక కాట్రీవల్లి అయ్యాడని అభివర్ణిస్తూ చర్చికుంటున్నారు.మొత్తానికైతే కాంగ్రెస్ మాజీ మంత్రి,

బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పోయిన బి ఆర్ ఎస్ యువ నాయకుడు ప్రతి పక్ష లోని మాజీ ఎమ్మెల్యే షాడో మున్సిపల్ ఛైర్మెన్ గా వ్యవహారిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అయిన బి ఆర్ ఎస్ జిల్లా నాయకుడు కలిసి కామారెడ్డి లో కెసిఆర్ ఓటమికి కారణం అవడమే గాక, ప్రస్తుతం బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి నాయకులు, ప్రజాప్రతినిధుల చేరికలను దగ్గరుండి ప్రోత్సాహిస్తూ , అధికార పక్షం తో చేతులు కలిపి కామారెడ్డి లో బి ఆర్ ఎస్ పార్టీ ని సర్వనాశనం చేయడమే గాక కామారెడ్డి ని అమ్ముకుని చెరో సగం పంచుకుని కామారెడ్డి ప్రజలను దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు కామారెడ్డిలో జరుగుతున్న ఈ వింత రాజకీయ చందరంగాన్ని చూస్తున్న ప్రజలు ఎవరు అధికార పక్షామో, ఎవరు ప్రతి పక్షామో, ఎమ్మెల్యే ఎవరో -మాజీ ఎమ్మెల్యే ఎవరో, ఛైర్మెన్ ఎవరో -షాడో ఛైర్మెన్ ఎవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు… పాపం ఈ జనాలకు ఇంకా తెలియట్లేదు ఓట్లసిన ప్రజల్ని పిచ్చోళ్లను చేయడమే రాజకీయ నాయకుల పని అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Join WhatsApp

Join Now