సిద్దిపేట/గజ్వేల్ మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు రూపుమాపే జర్నలిస్టులు బాధ్యత గల జర్నలిస్టులు అని, మెరుగైన సమాజ నిర్మాణంలో జర్నలిస్టులు, పోలీసుల పాత్ర కీలకమని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అందించగా.. సమాజంలో జరిగే ఆ సాంఘిక కార్యకలాపాలను తమ దృష్టికి తీసుకురావాలని వాటిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. చట్టం పరిధిలో ప్రజలు పని చేయాలని మద్యం, మాదకద్రవ్యాలు, పేకాట, గొడవలు లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండి మెరుగైన సమాజ నిర్మాణంలో పౌరులందరూ బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు రక్షణ కవచంగా నిరంతరం పని చేస్తున్నారని, దానికి జర్నలిస్టులో బాధ్యతగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా జర్నలిస్టులు తమ దృష్టికి తీసుకువచ్చి మెరుగైన సమాజంలో తమ వంతు కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యార్థిని, విద్యార్థులు విద్యపై తమ దృష్టి సాధించి ఉన్నత లక్ష్యాలను ఛేదించాలని విద్యతోటే మెరుగైన సమాజానికి బాటలు పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మహేందర్ రెడ్డి జర్నలిస్ట్ లు గుడాల శేఖర్, ఎల్లం రాజు, మహేష్ లు పాల్గొన్నారు.