మరమ్మతులపై ముందస్తు సమాచారం ఇవ్వండి..!!

మరమ్మతులపై ముందస్తు సమాచారం ఇవ్వండి – సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్..!!

విద్యుత్ మరమ్మతుల సమాచారం వినియోగదారులకు ఒక రోజు ముందుగా ఖచ్చితంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్  విద్యుత్ అధికారులను ఆదేశించారు.

విద్యుత్ నెట్వర్క్ నిర్వహణ మరియు మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేస్తున్నట్టు వినియోగదారునికి ముందస్తుగా తప్పనిసరిగా తెలియజేయాలి. అలా తెలియపరచక పోవడం వలన వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గురువారం ఉదయం ఉన్నత అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో విద్యుత్ మరమ్మతుల సమాచారం వినియోగదారులకు చెర వేసే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ సూచించారు. వర్ష కాలంలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడంలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మరమ్మతుల సమాచారం ఆయా ప్రాంతాల్లోని ప్రతి వినియోగదారుడికి చెర వేసేలా పత్రికా ప్రకటనలు, వినియోగదారుల మొబైల్ ఫోన్లకు sms రూపంలో సమాచారం అందించాలని సూచించారు. ప్రధానంగా బస్తిలు, కాలనీలలో ఆటో/బైక్ ల ద్వారా సిబ్బంది తో టామ్-టామ్ (మైక్ లో ప్రకటన) నిర్వహించాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులతో రూపొందించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల్లో సైతం మరమ్మతుల సమాచారాన్ని షేర్ చేయాలని సూచించారు.

చీఫ్ ఇంజినీర్లు, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు తమ తమ పరిధిలో నిర్వహిస్తున్న మరమ్మతు పనుల షెడ్యూల్ ను పరిశీలించడంతో పాటు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో తప్పనిసరిగా స్వీయ భద్రతా చర్యలు పాటించేలా చూడాలి. షెడ్యూల్ ప్రకారమే పనులు పూర్తి చేయాలని, షెడ్యూల్ సమయ పాలనను తూచా తప్పకుండ పాటించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment