విద్యుత్ ప్రమాదం జరుగుతుందంటే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వండి

విద్యుత్ ప్రమాదం జరుగుతుందంటే విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వండి

 

– కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 28

 

విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు మీ పరిధిలో వదులుగా ఉన్న , తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు , వంగిన స్థంబాలు, లైన్ క్రాసింగ్ , తదితర ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటిని గమనించిన వెంటనే మీ పరిధిలోని సెక్షన్ ఆఫీసర్( అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్ ) లేదా గ్రామ స్థాయిలో ఉండే లైన్ మెన్ కు తెలియజేయాలని కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగంగా ప్రమాద భరితంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించి జీరో ఆక్సిడెంట్ లక్ష్యంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, గాలి దుమారాల వలన విద్యుత్ తీగలు తెగి పడితే వెంటనే సమాచారాన్ని ఏ .ఈ లకు తెలియజేయాలని కోరారు. తడిగా ఉన్న స్థంబాలను ముట్టుకోకూదని చెప్పారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని , ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండా, అలాగే ఇనుప రేకుల గుండ వెళ్లకుండ చూడాలన్నారు. వినియోగదారుల గృహాలలో నాణ్యమైన వైరింగ్ వాడాలని, రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించాలని కోరారు. రైతులు, వినియోగదారులు స్వయంగా కరెంట్ పనులను సొంతంగా చేసుకోకూడదని తెలిపారు. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన టీజీఎన్ పిడిసిఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు సంప్రదించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment