Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దోస్త్ గడువు పొడిగింపు.

IMG 20240810 WA0011

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. దోస్త్ గడువు ప్రక్రియ పొడిగించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల కోసం… దోస్తు సిస్టం తీసుకువచ్చింది కేసీఆర్ సర్కార్.ఇందులో దరఖాస్తు చేసుకున్న వారికి డిగ్రీ సీట్లు… బీటెక్ లాగానే అందిస్తారు. అయితే… డిగ్రీలో చేరాలనుకునే వారికి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు మరొక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దోస్త్ స్పెషల్ ఫేస్ సెల్ఫ్ రిపోర్ట్ గడువును ఈ నెల 13వ తేదీ వరకు పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవానికి.. శుక్రవారం కి ఈ దోస్త్ గడువు పూర్తి కావాల్సింది. కానీ మరో నాలుగు రోజులు… పెంచుతూ ఈనెల 13వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు. దీనిపై తెలంగాణ డిగ్రీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version