మూఢనమ్మకాలకు చెక్! విద్యార్థినుల చైతన్యంతో మంత్రాలకు గుడ్ బై

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 10 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మహిళల చైతన్యంతో మూఢనమ్మకాల నిర్మూలన సాధ్యమని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులేటి నరేష్ అన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో శివంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శివంపేట మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం నందు మహిళల రక్షణ- వ్యక్తిత్వ వికాసం- సైన్సు- మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప్పులేటి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని. దొంగ స్వాములు భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా సామాజికంగా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. బాల్యవివాహాలకు విద్యార్థులు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉప్పులేటి నరేష్ మాంత్రికులు భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్ స్వామి, భానుచందర్, ఉపాధ్యాయులను స్వరూప,పోలీస్ సిబ్బంది అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now