ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఆదివారం నాడు చర్ల మండల కేంద్రంలో బిరబోయిన శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాష్ట్రపతి షెడ్యూల్ తెగలను గుర్తించి ఆమోదం తెలిపిన గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో కులగణన ఆయా కులాల ప్రకారంగా నమోదు ప్రక్రియ జరగాలని ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు
RCNO2467/TRI/TEEC/2016. ది 10/07/2017. కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ నుండి ఏజెన్సీ జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ జా రి చేసి ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్ కు ముఖ్యంగా గౌడ్స్ కులస్తులకు బిసి-బి గ్రూపు కుల ధ్రువీకరణ పత్రాలకు అర్హులు కాబట్టి వారికి ఎలాంటి ఏజెన్సీకి సంబంధించిన ఎస్టీ సర్టిఫికెట్స్ మంజూరు చేయొద్దని ఆదేశాలు జారీ చేసినారని అన్నారు.
రాజకీయ కోణంలో రిజర్వేషన్లను చూడకూడదని మైదాన ప్రాంత జిల్లాల నుండి బతుకుదెరువు కోసం ఏజెన్సీ లోకి వలస వచ్చిన గిరిజ నేతర గౌడ్ లను ఎస్టీలుగా గుర్తించండి అని అడగడం కడు సోషనీయం ఈ యొక్క కార్యక్రమంలో పూనేమ్ నాగేశ్వరరావు కొమరం ప్రతాప్ కారం రాజశేఖర్ కనితి మహేష్ కనితి రాకేష్ పాల్గొన్నారు.
ఏజెన్సీలోకి వలస వచ్చిన గౌడ్ కులస్తులకు కులగణన నమోదులో కేటగిరి బిసి-బి గ్రూపు గానే నమోదు చేయాలి
