బిజెపి ఆధ్వర్యంలో గావ్ చలో – బస్తీ చలో అభియాన్ కార్యక్రమం 

బిజెపి ఆధ్వర్యంలో గావ్ చలో – బస్తీ చలో అభియాన్ కార్యక్రమం

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

IMG 20250413 WA0002

జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో ఆదివారం గావ్ చలో – బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా వార్డు సమావేశం నిర్వహించి , కాలని వాసులకు కరపత్రాలు ఇచ్చి బీజేపీ సాధించిన విజయాలు వివరించడం జరిగిందని బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సంస్థాగత కార్యక్రమాలలో భాగంగా దేశంలోని అన్ని గ్రామాలు, పట్టణంలోని వార్డులలో గావ్ చలో – బస్తీ చలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పార్టీ గత 45 సంవత్సరాలలో సాధించిన విజయాలు, భవిష్యత్తులో సాధించాలని పెట్టుకున్న లక్యాలు ప్రతి కార్యకర్త తో పాటు ప్రజలకు కూడా వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోతుందని, విప్లవాత్మక సంస్కరణలు, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం, భవిష్యత్తు ప్రణాళిక లు ఇలా అన్ని రంగాలలో సమతూకంగా భారత్ ముందుకి వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్ జైన్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, నాయకులు సంతోష్, వేణు, రాజేష్, భరత్ , సాయి, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment