ఘనంగా బొంతపల్లి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు.. గర్భగుడి ద్వారాలను విరాళంగా అందజేసిన చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

IMG 20250324 112749
సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరన్న గూడెం.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి-సంధ్యా దంపతులు స్వామివారి అభిషేకం, పూజా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా సొంత నిధులతో 1,20,000 రూపాయల విలువైన గర్భగుడి ద్వారాలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం పూజారులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. భక్తుల క్షేమ సంతోషాలు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆలయ ఈవో శశిధర్, చిమ్ముల లలిత నరసింహారెడ్డి చిమ్ముల దీపా నరేందర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నబోయిన వేణు, అభి శెట్టి రాజశేఖర్, తుపాకుల రాజు, గోపాల్, గణేష్ అప్ప, రమేష్, సింహారెడ్డి, నరహరి, రవీందర్ రెడ్డి, సూర్యనారాయణ, చంద్రశేఖర్, అశోక్, వినోద్, నాగేష్, నల్తురి యాదగిరి, ఇతర కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now