సంగారెడ్డి/పటాన్ చెరు, మార్చి 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విరాళం అందజేశారు. కాజీపల్లి గ్రామంలోని శ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ గణపతి నూతన దేవాలయానికి 1,01,116 రూపాయలు, అలాగే సోలక్పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి 40,000 రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతను ప్రోత్సహించేందుకు, దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజలు భగవంతుడి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా దేవాలయాల నిర్వాహకులు గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజీపల్లి, సోలక్ పల్లి, గ్రామస్థులు నాయకులు పాల్గొన్నారు.