*ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ లో ప్రభుత్వ వైద్య శిబిరం*
*జమ్మికుంట జనవరి 28 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాల ఆరోగ్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వసతి గృహంలోని విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు టిబి నిక్షయ్ శివిర్ 100 రోజుల ప్రణాళికలో భాగంగా క్షయ వ్యాధి మీద వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత,సీజనల్ డిసీజెస్ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద డ్రై డే మీద అవగాహన కల్పించడం జరిగింది,చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థినులకు మందులు అందజేశారు వైద్య శిబిరంలో ఎంఎల్ హెచ్ పి డాక్టర్ చందన హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌందర్య,సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ ఆరోగ్య శాఖ సిబ్బంది సాజిదా,రామకృష్ణ, నరేందర్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.