కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోప్రభుత్వం నిర్లక్ష్యం

కొనుగోలు
Headlines:
  1. “జమ్మికుంటలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం”
  2. “రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముతున్నారని నేతల ఆవేదన”
  3. “భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్న రైతుల నష్టాలు”
  4. “రైతులు ప్రభుత్వం నుంచి సహాయం కోరుతున్నారు”

*ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు*

*పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు*

*జమ్మికుంట అక్టోబర్ 29 ప్రశ్న ఆయుధం:-*

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో జమ్మికుంట పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు రైతులు కొనుగోలు కేంద్రానికి విక్రయానికి తీసుకువచ్చిన వరి ధాన్యం పరిశీలించారు అనంతరం జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికే 80 శాతం ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకొని నష్టపోయారని తెలిపారు మిగిలిన 20 శాతం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ వస్తుందని ఆశతో ఒక్కొక్క రైతు 20 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. పిఎసిఎస్ చైర్మన్ పోనగంటి సంపత్ డిసిఓను ఫోన్లో సంప్రదించగా రైతులు కొనుగోలు కేంద్రాలకు 20 రోజుల నుండి విక్రయానికి తీసుకువచ్చారని రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా ఈన్యూ ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని గోదాములు కేటాయిస్తామని ఆయన తెలిపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పిఎసిఎస్ డైరెక్టర్ మిరుపాల తిరుపతిరావు, రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

*ఇబ్బందులు పడుతున్నాం.. ప్రభుత్వం కొనుగోళ్ళు ప్రారంభించాలి…

*రైతు దాసరి రాజయ్య, గ్రామం సైదాబాద్*

*జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామానికి చెందిన రైతు దాసరి రాజయ్య తనకున్న వ్యవసాయ భూమిలో పండించిన రెండు ట్రాక్టర్ల సుమారు 30 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని జమ్మికుంట పాత మార్కెట్ లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం విక్రయానికి తీసుకువచ్చారు. సిబ్బంది మ్యాచర్ చెక్ చేయగా నాణ్యత ప్రమాణాలకు లోబడి మ్యాచరల్ వచ్చింది. కానీ ప్రభుత్వం మిల్లులు అలాట్మెంట్ చేయలేదని ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని వారం రోజుల నుండి ఇబ్బంది పడుతున్నామని ఆయన తెలిపారు. ఇంకా చాలామంది రైతులు 20 రోజుల క్రితం విక్రయానికి తీసుకువచ్చారని ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆబాది జమ్మికుంటకు చెందిన ఎగిత కొమురయ్య తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు అలాట్మెంట్ చేస్తే ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభిస్తామని కొనుగోలు కేంద్ర నిర్వాహకులు అంటున్నారని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ చేసి కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరారు.

Join WhatsApp

Join Now