జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయుటకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. 

జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయుటకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. 

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 29( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తిమహేశ్వరరావు

ఖరీఫ్ సీజన్ కి ఆటంకం లేకుండా తోటపల్లి బ్యారేజీ వద్ద కుడి ఎడమ కాలవాల షట్టర్స్ వెంటనే బిగించాలి.

తోటపల్లి బ్యారేజ్ నిర్వాసితుల పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి జిల్లా మంత్రి సర్వ తీసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్.

పార్వతీపురం మన్యం జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేయుటకు ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తున్నది.

తోటపల్లి బ్యారేజీ వద్ద పాత,కుడి ఎడమ కాలవాల షట్టర్స్ మార్చాలని గౌరవ జిల్లా కలెక్టర్ మరియు పాలకొండ సబ్ కలెక్టర్ సమక్షంలో ఇరిగేషన్ అధికారులతో పలు దపాలు చర్చలు జరిగిన సందర్భంగా ఇదిగో కాలువ పనులు అదిగో కొత్త షటర్స్ వేస్తామని చెప్పడమే తప్ప నేటికీ ఆ తలుపులు మార్చడానికి కావలసిన అనుమతులు నార్త్ కోస్ట్ సీఈ వద్ద ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పడం సంబంధిత అధికారులు చెబుతుండడం సిగ్గుచేటని తక్షణమే కొత్త షటర్స్(తలుపులు) వేసి ఖరీఫ్ సాగునీటికి ఆటంకం లేకుండా చూడాల్సిన బాధ్యత జలవనరుల శాఖ అధికారులపై ఉందని తెలిపారు.జూలై 15 నాటికి పనులు పూర్తి చేసి సాగునీరు విడుదల చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సాధన తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు సాధన సమితి కలిపి ఉద్యమం చేయక తప్పదని సంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వానికి హెచ్చరించారు.

జిల్లాలో ఐదు దశాబ్దాల కాలం గడుస్తున్నప్పటికీ జంఝావతి పూర్తి కాకపోవడంతో సుమారు 24 వేల ఎకరాలు ఆయకట్టు వర్షాధారం మీద ఆధారపడి రైతులు పంటలను నష్టపోతున్నారని కనుక డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్న వారు ఈ సమస్యపై ఒరిస్సా ప్రభుత్వంతో సమస్య చర్చించే విధంగా ప్రజాప్రతినిధులకు కృషి చేయాలి. రాజకీయాలకు అతీతంగా జంఝావతీ ప్రాజెక్ట్ సాధన సమితి ఆధ్వర్యంలో జల హారతి తో పాటు గ్రామాల్లో ముఖ్యమంత్రి కి ఉత్తరాల ఉద్యమ కార్యక్రమం కొనసాగుతుందని అప్పలనాయుడు తెలిపారు.

పాలకొండ మండలంలో జంపర్ కోట రిజర్వాయర్ పనులు అసంపూర్తిగా ఉండిపోవడంతో ఉదిత్ తుఫాన్ లో ప్రధాన గట్టును కొట్టుకు పోగా అది నాటి నుంచి నేటి వరకు మొండిగట్టులతోనే దర్శనమిస్తుందని పాలకులు మారుతున్న ఆ పనులు పూర్తి కాలేదని దీనిపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవ తీసుకుని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లకపోతే 2100 ఎకరాల ఆయకట్టు గల గిరిజన రైతులు నష్టపోతున్నారని తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గురుబిల్లి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.

రావాడ గెడ్డ రిజర్వాయర్ ఆధునీకరణ, సీతానగరం ఆనకట్ట, పెద్దఅంకలం ఆనకట్ట, వెంగళరాయ ప్రాజెక్టు పొడిగింపు మరియు ఆధునీకరణ పనులు,పెద్దగెడ్డ పనులు పూర్తికై జిల్లా మంత్రి సంధ్యారాణి చొరవ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.

 

తోటపల్లి బ్యారేజి నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాలు కాలం గడుస్తున్న నేటికీ ప్రాజెక్టులో సమిధులైన నిర్వాశితులకు ఇవ్వవలసిన ప్యాకేజీలు,రావలసిన బకాయిలు లబ్ధిదారులకు అందకపోవడంతో అటు భూములు కోల్పోయి ఇటు జీవనం సాగడం చాలా దుర్భరంగా ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కావున తోటపల్లి నిర్వాసితుల సమస్య వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో పెండింగ్ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారానికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే ప్రాజెక్టుల వారి ఉద్యమం చేపట్టానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వెనుకాడదని తెలియజేసుకుంటున్నాం. కౌల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిమిడి రామ్మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అభినందనలతో

బుడితి అప్పలనాయుడు

జిల్లా ప్రధాన కార్యదర్శి

ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం

Join WhatsApp

Join Now

Leave a Comment