తురకనాయుడువలస లో రచ్చబండ ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్..

*తురకనాయుడువలస లో రచ్చబండ ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్..*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 19( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, తురకనాయుడువలస గ్రామపంచాయతీ ఎస్సీ వీధిలో గురువారం నాడు యూత్ కమిటీ కుర్రవాళ్ళు శ్రమదానంతో నిర్మించిన రచ్చబండ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వవిప్ కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి* హాజరయ్యి రిబ్బన్ కట్ చేశారు. గ్రామ పంచాయితీ ప్రజలు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశంపార్టీ జెండాను ఎగురవేసి, డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తింపజేసిన సందర్భంగా పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి*నారా* *చంద్రబాబునాయుడు* ఉప ముఖ్యమంత్రి*కొణిదెల పవన్ కళ్యాణ్* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి *నారా లోకేష్* చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలభిషేకం చేశారు. అలాగే కుదమ పంచాయతీలో, తురకనాయుడువలస పంచాయతీలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి *శ్డొంకాడ రామకృష్ణ* , ఎంపీపీ * బొంగు సురేష్* టీడీపీ మండల పార్టీ అధ్యక్షులుపల్ల రాంబాబు*, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అడ్వైసర్ కమిటీ మెంబర్ * నందివాడ కృష్ణబాబు* వొట్టిగెడ్డ ప్రాజెక్టు ఛైర్మన్ యం సత్యం నాయుడు వైస్ ఛైర్మన్ ముంజేటి ప్రసాద్ , క్లస్టర్ ఇంచార్జి జోగి భుజింగరావు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాజేంద్ర , టీడీపి సీనియర్ నాయకులు పూడి సీతారాం , దాసరి రామరావు గారు మరియు తురకనాయుడు వలస గ్రామ ex సర్పంచ్ మరడ శ్రీనివాసరావు సర్పంచ్ పోతల నాగమణిమరియు గ్రామ పంచాయతీ పెద్దలు, మహిళలు, కమిటీ కుర్రాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment