*బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే..*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 19 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి పక్క రహదారి సౌకర్యం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి* అన్నారు. సోమవారం నాడు కురుపాం మండలంలో గుజ్జువాయి గ్రామం నుండి డేరింగ్ పాడు గ్రామం వరకు 2.8 కోట్లు నిధులతో మంజూరైన నూతన బీటీ రహదారి నిర్మాణ పనులకు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* భూమి పూజ చేసి, రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ కలిసేటి కొండయ్య, ఎంపీడీవో జె ఉమామహేశ్వరి, సర్పంచ్ నాగేశ్వరరావు, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, నాయకులు రంజిత్ కుమార్ నాయకో, సుబ్బలక్ష్మి, యువరాజ్, శంకర్, ప్రదీప్, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.