ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసిన ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే..

*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసిన ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే..*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 27( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* విజయవాడలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గురువారం నాడు కలిసి నియోజకవర్గంలో పలు సమస్యలను వివరించారు. ఈమేరకు నియోజకవర్గంలో ప్రధానంగా ఏనుగులు సమస్యను పరిష్కరించాలని, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి నిధులు విడుదల, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకువచ్చేలా కృషి చెయ్యాలని విన్నవించారు. తోటపల్లి, గుమ్మిడిగెడ్డ, ఒట్టిగెడ్డ, జంఝావతి ప్రాజెక్ట్లు మరియు నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment