Site icon PRASHNA AYUDHAM

జలవనరుల శాఖ మంత్రినికలిసిన ప్రభుత్వవిప్ కురుపాంఎమ్మెల్యే

IMG 20250626 WA2163

*జలవనరుల శాఖ మంత్రిని* *కలిసిన ప్రభుత్వ* *విప్ & కురుపాం* *ఎమ్మెల్యే*

*తోయక జగదీశ్వరి..*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 27 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* విజయవాడలో జలవనురుల శాఖ మంత్రి

డా. నిమ్మల.రామానాయుడు ని బుధవారం కలిసి నియోజకవర్గంలోని తోటపల్లి, గుమ్మిడిగెడ్డ, ఒట్టిగెడ్డ, జంఝావతి ప్రాజెక్టులపై చర్చించారు. ఒట్టిగెడ్డ రిజర్వాయర్ ప్రాజెక్టు పరిధిలో 16,684 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందించేలా కృషి చెయ్యాలని విన్నవించారు. ఈ ఖరీఫ్ సీజన్ కు పూర్తిస్థాయిలో నీరు అందించేలా ప్రపోజల్ పెట్టిన 30 పనులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని మంత్రి ని కోరారు. మంత్రి కలిసిన వారిలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మర్రాపు పురుషోత్తం నాయుడు, పొట్నూరు వెంకట నాయుడు ఉన్నారు.

Exit mobile version