ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి 

*ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 8 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

మహిళలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రభుత్వం స్వయం ఉపాధి ద్వారా కల్పిస్తున్న ఇటువంటి శిక్షణలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యుల *తోయక జగదీశ్వరి* అన్నారు. గురువారం గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని వై.టి.సి (యూత్ ట్రైనింగ్ సెంటర్) లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మహిళలకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందగలిగితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాలను చక్క దిద్దుకోవచ్చని అన్నారు. ఆ దిశగా మీకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. మీరంతా ఈ శిక్షణలో రాణించి పలువురు మహిళలకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాడి సుదర్శన్ రావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, ఏఎంసి చైర్ పర్సన్ కడ్రక కళావతి, ఎంపీడీవో సాల్మన్ రాజ్, నాయకులు నందివాడ కృష్ణ బాబు, వెంపటాపు భారతి, తాడంగి రామారావు, అడ్డాకుల నరేష్, నిమ్మక సింహాచలం, అప్పలస్వామి, రాజేష్, చిన్న, సుబ్బలక్ష్మి, శిక్షణ కేంద్ర నిర్వాహకులు రాజేష్, వై టి సి సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment