గర్భిణీల వసతి గృహాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 8 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల వై టి సి భవనంలో ఉన్న గర్భిణీల వసతి గృహాన్ని గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి సందర్శించారు. అక్కడ ఉన్న గర్భిణీలతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు నడవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు చేసుకోవాలని సూచించారు. వారి వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.