ఫీజులపై సర్కారు నిర్లక్ష్యం కళాశాలల కఠినత్వం.

సర్కారు ఫీజులు చెల్లింపులు చెయ్యకపోతే చదువులు కొనసాగేదెలా.

ఫీజులపై సర్కారు నిర్లక్ష్యం కళాశాలల కఠినత్వం

 అయోమయంలో విద్యార్థిలోకం.

గత మూడేళ్లుగా మంజూరు కానీ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు.

IMG 20241015 WA0092

 గత మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ను తక్షణమే విడుదల చేయాలని,విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ పేజీ కళాశాలలు ఈ నెల 14 నుండి రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో నిర్వదిక బందును నిర్వహిస్తుందని, దీనివల్ల విద్యార్థుల తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని *ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికాల రామకృష్ణ* ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం గిరి ప్రసాద్ భవన్ లో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో 

ఇటికాల రామకృష్ణ. మాట్లాడుతూ

నాన్ ప్రొఫెషనల్ 2000 కోట్లు ప్రొఫెషనల్ 4000 కోట్లు గాను పెండింగ్ ఉపకార వేతనాలు ఉన్నాయని,2021 -22 ప్రభుత్వం విడుదల చేసిన బకాయలు 30% 2022 -23 గాను 20%,

2023 -24 గాను జీరో పర్సెంట్ బకాయిలు ఉండడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు 

 నిర్వాదిక బంద్ నిర్వహిస్తున్నాయన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వి విడుదల చేయకపోవడంతో ఈ నిర్వాదిక బంధు నిర్వహిస్తున్నట్లు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయని,

ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందని ఆయన విమర్శించారు.ఇప్పటికే గత మూడు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని,ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్లతోనే ప్రభుత్వం చర్చలు జరిపి విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.

2024, 2025 విద్యా సంవత్సరం గాను ఇప్పటివరకు స్కాలర్షిప్ ఈపాస్ ఆన్లైన్ డేట్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ బీసీ స్కాలర్షిప్స్ 1500 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పిందన్నారు.స్కాలర్షిప్స్ ఆన్లైన్ డేట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 1500 కోట్ల బీసీ స్కాలర్షిప్స్ ఉపకార వేతనాలు ఏమయ్యాని ఆయన ప్రశ్నించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని,

 సమీకృత గురుకులాలు ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకు పన్నాగం పన్నుతుందని,

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లోనే సమకృత గురుకులాల ఏర్పాటు చేశారు కానీ మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్మిస్తున్న సమకృత గురుకులాలను ఆహ్వానిస్తున్నామని కానీ అదే సమయం లో ప్రస్తుతం ప్రభుత్వం నడుపుతున్న మిగతా గురుకులం పరిస్థితి ఏంటని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించకుండా సమకృత గురుకులాలు ఎలా నిర్వహిస్తారన్నారు.

ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఒక ప్రభుత్వ పాఠశాలలు కచ్చితంగా ఉండాలనే ఒకవైపు ప్రభుత్వం చెబుతూనే మరోవైపు సమకృత గురుకులాల వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందీ 

ప్రతి పాఠశాల పరిపూర్ణ విద్యను అందించగలిగితే ఆయా ప్రాంతాల విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సిన అవసరం రాదని ఆయా ప్రాంతాల పాఠశాలను మూసివేసే పరిస్థితులు కూడా రాదని గ్రామాల నుండి విద్యార్థులు ఈ గురుకులాలు చేరడం వల్ల ఆయా గ్రామాలలోని పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని అన్నారు గత ప్రభుత్వం కులానికి ఒక గురుకులాలని తీసుకొచ్చి కుల వ్యవస్థ పెంచి పోషించిందని విద్యార్థుల మధ్యన అంతరాలని పెంచిందని అన్నారు.

కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టో ఖమ్మం కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తక్షణమే యూనివర్సిటీ ఏర్పాటుకు జిల్లా మంత్రులు చొరవ తీసుకొని హామీను నెరవేర్చాల అన్నారు

 రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో యూనివర్సిటీలు ఉన్నాయని ఖమ్మం జిల్లాలో మాత్రమే ఏర్పాటు చేయలేదని 2008లోని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని ఖమ్మంలో ప్రకటించి విస్మరించిన విషయాన్ని గుర్తు చేశారు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు యూనివర్సిటీ సాధన కోసం దశాబ్దాల కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని స్వరాష్ట్రం వరకు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ప్రజాతంత్ర వాదులు మేధావులు పోరాటాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో ఉంది తక్షణమే ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు చొరవ చూపి ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాల ఏర్పాటుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.కె నాగులమేర ,శివ నాయక్, వంశీ, జిల్లా నాయకులు మనోజ్ రాకేష్ ప్రతాప్ గోపి రోహిత్ సాయి నరేష్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now