- జర్నలిస్టులకు ప్రతినెల ప్రభుత్వం జీతంకేటాయించాలి.బాపు రావు
తెలంగాణ జర్నలిస్టుల ఆత్మహత్యలు రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం..కాట్యాడ బాపురావు.
మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఐదు రోజుల లోపు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి…
కాట్యాడ బాపురావు ప్రశ్న ఆయుధం దినపత్రిక ఎడిటర్.. తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి..మొబైల్ నెంబర్ 9440248261
జర్నలిస్టులకు ప్రతినెల ప్రభుత్వం జీతం కేటాయించాలి అని కాట్యాడ బాపురావు డిమాండ్ చేశారు…
రాష్ట్రంలో జర్నలిస్టులు ఆత్మహత్యలపై స్పందించారు.. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు….ఈ సందర్భంగా కాట్యాడ బాపురావు మాట్లాడుతూ..మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఐదు రోజుల లోపు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు…రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, వారి కుటుంబ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవనికాట్యాడ బాపురావు ప్రశ్న ఆయుధం దినపత్రిక ఎడిటర్.తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి హెచ్చరించారు. నాలుగు రోజుల వ్యవధిలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఇద్దరు జర్నలిస్టుల ఆత్మహత్యలు జర్నలిజంపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాల్లోని దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు.మంగళవారం గోదావరిఖని పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు నాయిని మధునయ్య, శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో మరో యువ పాత్రికేయుడు యోగి రెడ్డి కుమార్తెతో సహా ఆత్మహత్యలు తమను కలచి వేశాయని అన్నారు.యాజమాన్యాల నుండి జీతభత్యాలు లేకపోయినా,సమాజ హితమే లక్ష్యంగా అనేకమంది జర్నలిజం వృత్తిపట్ల ఆకర్షితులై,ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో గతంలోనూ 200 మందికి పైగా జర్నలిస్టులు ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు..తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు..సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీలకు సమాంతరంగా, జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చి, దానికి తగినన్ని నిధులు కేటాయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ బ్యూరోక్రాట్ల చేతుల్లో, మీడియా అకాడమీ ఒక సంఘానికి నేతృత్వంవహిస్తున్న నేత కనుసన్నల్లో నడుస్తుండడం వల్ల,యావత్ తెలంగాణ జర్నలిస్టు సమాజానికి ఈ వ్యవస్థల పట్ల సంపూర్ణ విశ్వాసం లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్న అన్ని సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ తెలంగాణ జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలని,ఇందుకుగాను అని సంఘాల నేతలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలోని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగా తెలంగాణలో జర్నలిస్టుల పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని,రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా జర్నలిస్టుల కోసం ప్రత్యేక ఆరోగ్య భీమా పథకం రూపొందించాలని,రాష్ట్రంలో పత్రిక యాజమాన్యాలకు జారీ చేస్తున్న ప్రకటనలు నుండి ప్రభుత్వం కొంత మొత్తాన్ని రికవరీ చేసి దానిని జర్నలిస్టుల సంక్షేమం కోసం వేయించాలని కాట్యాడ బాపురావు ప్రశ్న ఆయుధం దినపత్రిక ఎడిటర్.తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు…