ములకలపల్లి మండల MPDO కి వినతిపత్రం*
*జూలై 9 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసు అందజేశిన TUCI నాయకులు*
ములకలపల్లి ప్రశ్నఆయుధం జూన్ 28:
గ్రామపంచాయితీ కార్మకులకు జీతాలను తక్షణమే అందజేయాలని కోరుతూ,
TUCI అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయితీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ములకలపల్లి ఎం.డి.పి.ఒ గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా TUCI జిల్లా సహాయ కార్యదర్శి నూపా భాస్కర్, ఉపాధ్యక్షుడు గోనెల రమేష్ లు మాట్లాడుతూ,
జిల్లాలో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు రెండు నుంచి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని,
అరకొర జీతాలతో బతుకు లీడుస్తున్న పంచాయతీ కార్మికులకు జీతాలు ప్రతినెల సక్రమంగా అందజేయకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఎకౌంట్లో జమ చెస్తామని ప్రకటించారని
మూడు నెలలు అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కార్మికులకు జీతాలను వారి వ్యక్తిగత అకౌంట్లలో జమ చేయలేదని అన్నారు.
గతంలో కూడా కొన్ని గ్రామపంచాయతీలలో కార్మికులకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని,
అడ్డ మీద కూలీలకు ఇస్తున్న వేతనం కూడా పంచాయితీ కార్మికులకి ఇవ్వని స్థితి ఉన్నదని విమర్శించారు. గొర్రె
తోక బెత్తడు అన్న చందంగా ఉన్న జీతాలను కూడా సక్రమంగా నెల నెల ఇవ్వకపోవడంతో పంచాయితీ కార్మికులు వారి కుటుంబాలు వీధనపడే ప్రమాదం ఉన్నదని, తక్షణమే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదరిగానే వ్యక్తిగత అకౌంట్లో జమ చేయాలని,
పెండింగ్లో ఉన్న జీతాలను కూడా తక్షణమే అందజేయాలని వారు కోరారు.
2025 జూలై 9న దేశ వ్యాపితంగా కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయనీ, ఈ సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు కూడా పాల్గొంటున్నారు అని, కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఏధేచ్చగా అమలుకు పూనుకున్నది అని, ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను నవీకరిస్తున్నామనే పేరుతో, గతంలో పోరాడి సాధించిన హక్కును హరిస్తూ, “4 లేబర్ కోడ్స్” తీసుకురావడం జరిగిందని వీటి అమలును నిలిపివేయాలని, కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, ఈపీఎఫ్ పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, స్కీం వర్కరస్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని, మోటార్, హమాలీ వర్కర్స్ కి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రైతాంగానికి కనీస మద్దతు ధరను ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించరాదనే డిమాండ్లతో కార్మిక వర్గం ఒక రోజు సమ్మె చేసి, నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి శీల గ్రామ పంచాయితీవర్కర్స్ యూనియన్ పాల్వంచ ఏరియా నాయకుడు కోండ్రు శ్రీను, వర్కర్స్ గడ్డం నాగరాజు, కొర్సా వెంకటేష్, కుంజా నగేష్,ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.