లయన్ అమర్నాథ్ రావుకు ఘన సన్మానం
గజ్వేల్, 11 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో 2025 2026 సంవత్సరానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ గా కాబోతున్న లయన్ అమర్నాథ్ రావుని శనివారం లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ సత్యనారాయణ టీచర్ మరియు లయన్స్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీచర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో తమ జీవితాన్ని ప్రారంభించి కృషి, పట్టుదతో నిరంతరం సమాజ సేవలో పాల్గొంటూ మా ఉపాధ్యాయ వర్గం నుండి లయన్ డిస్ట్రిక్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా డిస్టిక్ గవర్నర్ కాబోతున్న అమర్నాథ్ రావుకి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ విజయం ఉపాధ్యాయ సమాజానికి గర్వకారణం అని హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ గోలి సంతోష్, జోన్ చైర్మన్ నేతి శ్రీనివాస్ గుప్తా, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, కోశాధికారి దొంతుల సత్యనారాయణ, లయన్స్ ప్రతినిధులు రాంప్రసాద్ రావు, నరసింహారావు, శ్రీధర్, పరమేశ్వర్ చారి, రాధాకృష్ణ, సత్యనారాయణ, సత్తయ్య, శ్రీనివాస్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.