Site icon PRASHNA AYUDHAM

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన హుస్నాబాద్ మహిళా భక్త బృందం

IMG 20250627 WA0062

*శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన హుస్నాబాద్ మహిళా భక్త బృందం*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 27 ప్రశ్న ఆయుధం*

అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హుస్నాబాద్ కు చెందిన హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హుస్నాబాద్ నుండి సుమారు 100 మంది మహిళలు గత సంవత్సరం నుండి ప్రతి మంగళవారం ఏదో ఒక దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పలువురు మహిళలు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రావడం అదృష్టమని ఆలయానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడా ఎప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలగలేదని శ్రీ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం వల్ల ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందని హనుమాన్ చాలీసా మహిళా భక్త బృందం చే ఐదు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించడం జరిగిందని మహిళలకు ఆషాడ మాసం పునర్వాస నక్షత్రంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ ఉందని ఆషాడ మాసాన్ని సప్త నవరాత్రులు గా పిలుస్తారని ఈ ఆషాడ శ్రవణాలు ఎంతో శ్రేష్టకరమంటారని తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శన భాగ్యం కలగడం మా అదృష్టమని స్వయముగా వెలసిన స్వామివారిని దర్శించుకోవడం మా పూర్వజన్మకృతమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాడిశెట్టి హేమలత, మాధవి, స్వరూపరాణి, రజిని, శ్రీదేవి, లావణ్య ,రాధా, తిరుమల, వనజ, కవిత,తో పాటు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version