అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర..

*అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర..*

పాలకుర్తి మండల కేంద్రంలోని పాటిమీది హనుమాన్ భక్తమండలి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక గుడివాడ చౌరస్తాలో ఉన్న పంచగుళ్ళ నుంచి రాజీవ్ చౌరస్తా మీదుగా పాటి మీది ఆంజనేయస్వామి దేవాలయం వరకు హనుమాన్ శోభాయాత్ర అశేషంగా పాల్గొన్న హనుమాన్ భక్తుల భజనలతో నృత్యాలతో పాటు మీది ఆంజనేయస్వామి దేవాలయం వరకు కొనసాగింది. అనంతరం,పంచామృతాభిషేకముసింధూర లేపనంతో స్వామివారికి పూజా కార్యక్రమం నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో హనుమాన్ స్వాములు సంగ కృష్ణమూర్తి, ఆకుల నాగరాజు, కోల నారాయణ, దాసరి మధు, చిలువేరు మల్లయ్య, లాకావత్ నరహరి, వీరమనేని వెంకటేశ్వర్ రావు, మాదంశెట్టి భాస్కర్, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment