రైతు భరోసా నిధులు జమ రైతు ముఖంలో ఆనందం

*రైతు భరోసా నిధులు జమ రైతు ముఖంలో ఆనందం*

*శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన చైర్మన్ ఇంగిలే రామారావు*

*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 18 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రైతు భరోసా కింద ఎకరానికి 6000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమ కావడంతో రైతు ముఖంలో ఆనందం వెళ్లి విరిసిందని కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు అన్నారు బుధవారం రోజున మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు మూడు రోజుల నుండి రైతు భరోసానిధులను రైతుల ఖాతాలలో ఎకరానికి 6000 చొప్పున జమ చేయడం జరిగిందని సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని వర్షాకాలం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కావడం వల్ల రైతుల కళ్ళలో ఆనందోత్సవాలు వెళ్లి విరిసాయన్నారు. ఎకరానికి 6000 చొప్పున జమ 9 రోజులలో తొమ్మిది వేల కోట్లు అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలలో జమ చేస్తారని 70 లక్షల రైతన్నల చెంతకి నేరుగా వారు అకౌంట్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్దపీట వేసిందని మన దేశంలో ఏ రాష్ట్రం ఇంత ఎక్కువ ఖర్చు చేసిన దాఖలాలు లేవని వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ధాన్యం కొనుగోలు సన్నాలకు బోనస్ ,రైతు బీమా, పంట బీమా ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే గత ప్రభుత్వం పంట బీమా నిర్వీర్యం చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా పెట్టుబడి సహాయం పొందడానికి ఇంతవరకు దరఖాస్తు చేసుకొని రైతు సోదరులు దరఖాస్తు చేసుకోవాలని ఈ అవకాశం ఈనెల 20 వరకు ఉందని రైతులు వారి వెంట పట్టాదారు పాసుబుక్ ,ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ మొబైల్ నెంబర్ తో వ్యవసాయ శాఖ ఏవో ,ఏఈవోకు అందజేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న రైతు భరోసా వస్తున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment