ఘనంగా వాల్మీకి జయంతి

*Screenshot 2024 10 17 16 27 21 52 6012fa4d4ddec268fc5c7112cbb265e7

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి ) తెలుగు శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్  హిమజా  మాట్లాడుతూ బోయవాడై జ్ఞానాన్ని పొంది తొలి కావ్యం రామాయణాన్ని రచించడం వాల్మీకి ని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు ప్రబోధించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన సాహితీవేత్త నాగేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ వాల్మీకి బోయ నుండి రామనామ ప్రభావం మహర్షి గా మార్పు చెంది రామాయణాన్ని విరచించి లోకానికి ఆదికవిగా నిలిచారని తెలుపుతూ రామాయణ ప్రాశస్త్యాన్ని వివరించారు. తెలుగుశాఖ అధ్యాపకులు డా.కపిలభారతీ, డా. నండూరి రాంబాబు, జాయ్ కిరణ్, వీరన్న, వరాలబాబు, లక్ష్మి దేవి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిరి.

Join WhatsApp

Join Now