*టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్*
• నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు.
• మీ కుటుంబాల్లో వెలుగులు నిండి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
• 2024 మనకు ఇన్స్పైరింగ్ సంవత్సరం. వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో ఈ ఏడాది ఎన్నికల్లో మనకు తిరుగులేని విజయం దక్కింది.
• రాబోయే రోజుల్లో కూడా దశదిశ నిర్ధేశించుకుని ముందుకెళ్దాం.
• సభ్యత్వాల నమోదులో కార్యకర్తలు, నాయకులు చూపిన చొరవ స్ఫూర్తిదాయకం. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు మన పార్టీకి ఉన్నారు.
• అక్టోబర్ 26న ప్రారంభించిన సభ్యత్వాలు నేటికి 93 లక్షలు దాటాయి. అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
• ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి. ఈ ఉత్సాహం చూస్తే సభ్యత్వాల సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది.
• టెక్నాలజీ ఉపయోగించి ఇన్ని సభ్యత్వాలు నమోదు చేయగలిగాం.
• రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా అందించబోతున్నాం.
• గ్రామాల్లోనూ పోటీపడి సభ్యత్వాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదవుతున్నాయి.
• కష్టపడ్డ కార్యకర్తలను నేరుగా గుర్తించేందుకు ఈ సారి కొత్తగా రిఫరల్ విధానం తీసుకొచ్చాం.
• గత ఐదేళ్లలో రూ.135 కోట్లను కార్యకర్తల సంక్షేమ నిధికి ఖర్చు పెట్టాం.
• పాలకొల్లు, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, కుప్పం, రాజంపేట, ఉండి, కళ్యాణదుర్గం, గురజాల, వినుకొండ, మంగళగిరి నియోజకవర్గాలు మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.
• శాశ్వత సభ్యత్వాల్లో మంగళగిరి(112), ఆత్మకూరు(85), జీడీ నెల్లూరు(61), పెదకూరపాడు(50), తణుకు(44), ఉండి (36) నియోజకవర్గాలు టాప్లో ఉన్నాయి.
• ఈ సభ్యత్వ నమోదు నేటితో ముగించాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ల విజ్ఞప్తి మేరకు మరో 15 రోజుల సమయాన్ని పెంచుతున్నాం.
• మహానాడులోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తాం. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, అనుబంధ సంఘాల పదవులన్నీ పార్టీ కోసం కష్టపడ్డవారికే కేటాయిస్తాం. క్షేత్ర స్థాయిల్లో పని చేసిన వారికి పార్టీ పదవులు ఇస్తాం.
• రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోవు. గత ఐదేళ్లు కార్యకర్తలను కాపాడుకోవడానికి పని చేశా…ఇప్పుడు గుర్తించడానికి పనిచేస్తా.
• ఆరు నెలల పాలనలో అనేక కార్యక్రమాలు అమలు చేశాం.
• గోదావరి నీటిని బనకచర్లకు తీసుకెళ్లి తెలుగుతల్లికి జలహారతి ఇస్తాం.
• ఇది పూర్తయితే రాష్ట్రంలో కరువు ఉండదు. గేమ్ ఛేంజర్ అవుతుంది. రాష్ట్రానికి ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి…తద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
• 2029 ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే పని చేయాలి. ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం.
• పెన్షన్లు కూడా ఇంటికెళ్లి ఇస్తున్నారా లేదా అన్నది జియోట్యాగింగ్ ద్వారా తెలుసుకుంటున్నాం.
• వాట్సాప్ గవర్నెన్స్ ను కూడా తీసుకురాబోతున్నాం.
• దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం. ఎవరూ అజాగ్రత్తతో ఉండొద్దు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి.
• ముఖ్యమంత్రిగా ఒకపక్క పాలన సాగిస్తూనే మరోవైపు కార్యకర్తలకు సమయం కేటాయిస్తున్నా. కార్యకర్తలను నాయకులు కలుపుకుని వెళ్లాలి.
• గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఎడాపెడా అప్పులు చేశారు.
• గత ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిన పెట్టడం వల్ల ప్రజల్లో మరింత నమ్మకం వచ్చింది.
• గత ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసింది. మద్య నిషేదం, సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీలు తామెప్పుడు ఇచ్చామని బుకాయించారు.
• రైతు భరోసా, చేయూత పథకాల్లోనూ రైతులు, మహిళలను మోసం చేశారు.
• సూపర్-6 హామీలను తప్పకుండా నెరవేర్చుతాం. అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు చేస్తాం.
• సోషల్ రీ ఇంజనీరింగ్ విధానానికి కట్టుబడి ఉన్నాం.
• మన ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లు పెన్షన్కు ఖర్చు చేస్తోంది. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంత పెద్దమొత్తంలో పెన్షన్లు ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదు.