ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వేల్, 13 జనవరి 2025 :
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ భోగభాగ్యాలతో ప్రజలందరూ ఆనందలతో సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని, ఈ సంక్రాంతి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని, సిరిసంపదలతో తులతూగాలని, పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతునితో కోరుకున్నారు.