తెలుగు రాష్ట్ర ప్రజలకువిజయదశమి శుభాకాంక్షలు
సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ..
తెలంగాణ ప్రజలతోపాటు , ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ . విజయదశమి తెలుగు ప్రజలకు అష్టైశ్వర్యాలను కల్పించాలని , ఆయురారోగ్యాలను , పాడి పంటలను ప్రసాదించాలని ఆకాంక్షించారు . చెడును తొలగించి మంచిని ప్రసాదించాలని విజయదశమి ఘనతగా చెబుతూ ఉంటారు . ప్రజల కష్టాలు , నష్టాలు , బాధలు తొలగిపోవాలని అందరికీ సుఖసంతోషాలు ప్రసాదించబడాలని అమ్మవారిని వేడుకున్నారు . చెడుపై మంచి సాధించిన విజయంగా దేశ ప్రజలు భావిస్తూ ఉంటారు అని అన్నారు . దేశ ప్రజలందరికీ మంచి జరగాలని అలాగే అమ్మవారు ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించబడాలని ప్రార్థించారు .