*మల్లారెడ్డి హెల్త్ సిటీలో సైనికులకు సంఘీభావం తెలిపిన హరీష్ రావు, మల్లారెడ్డి, కేపీ వివేకానంద*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 10
ఈ సందర్భంగా ఇటీవల వీర మరణం పొందిన సైనికుడు ఎం. మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, భారతీయ సైనికుల ధైర్యసాహసాలను కొనియాడారు. సరిహద్దులు కేవలం భౌగోళికంగానే కాకుండా దేశ ప్రజల భద్రత, భవిష్యత్తుకు కూడా ప్రాముఖ్యమైనవని ఆయన అన్నారు. మతం పేరుతో అమాయక టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవని ఆయన సమర్థించారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి యువతీ యువకుడు దేశం కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైతే మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. సైనికుల కోసం రక్తదానం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. సరిహద్దుల్లో పోరాడలేకపోయినా, సైనికులకు అవసరమైన రక్తం, వైద్యం అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా దేశ ప్రజలదేనని ఆయన ఉద్ఘాటించారు. “భారత సైనికుల్లారా, మీరు సరిహద్దుల్లో మా కోసం పోరాడుతున్నారు. మీ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధత మాకు గర్వకారణం, మీ పోరాటం మాకు స్ఫూర్తి” అని ఆయన అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ, దేశ సైనికులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమం ముగింపులో “జై భారత్”, “జై హింద్” నినాదాలు మారుమోగాయి.