డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే చంపేశాడు!

 

 

డబ్బులివ్వలేదని.. కన్నతల్లినే చంపేశాడు!

IMG 20240822 WA0097

డబ్బులివ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్నతల్లిని కర్రతో కొట్టి చంపాడు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం దుర్కిలో ఈ ఘటన జరిగింది. మెక్క అంజవ్వ(46) భర్త సాయిలు ఏడాది కిందట మృతి చెందగా ఆమెకు రూ.5 లక్షల రైతు బీమా డబ్బులు అందాయి. అంజవ్వ కుమారుడు సాయికుమార్‌ జులాయిగా తిరుగుతూ.. డబ్బులివ్వాలని తరచూ గొడవ పడుతుండేవాడు. మంగళవారం సాయంత్రం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తల్లిని కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Join WhatsApp

Join Now