రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: KTR
తెలంగాణలో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నా ఇప్పటివరకు మరణాలేమీ లేవని ప్రభుత్వం బుకాయించడం దారుణమని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘నిన్న ఐదుగురు, ఇవాళ ముగ్గురు చనిపోయారని వార్తా కథనాలు స్పష్టంగా పేర్కొన్నాయి. డాటాను ఎందుకు దాస్తున్నారు? ఆసుపత్రుల్లో మందులు లేవు. ఒక్క బెడ్ను 3-4 పేషెంట్లు షేర్ చేసుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం వచ్చింది’ అని అన్నారు.