చలో హైదరాబాద్

30న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాల్ స్వామి

సిద్దిపేట జూలై 25 ( ప్రశ్న ఆయుధం ) :

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారిని పర్మనెంట్ చేయాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 30 వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి పిలుపునిచ్చారు. గురువారం రోజున గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు బర్మ కొమురయ్య అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై నా గోపాలస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని వారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తామని మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని పొందుపరిచారని కానీ అటువంటి ఊసే లేదని వారన్నారు పెరిగిన ధరలతో కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని అందుకు ప్రతి కార్మికుడికి నెలకు 26వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగితే ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని అందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు పంచాయతీ బడ్జెట్ నుండి ఇన్సూరెన్స్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన చేలు హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్ జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల నర్సయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి మహేష్ జిల్లా కోశాధికారి రాజనర్సు జిల్లా కమిటీ సభ్యులు దేవులపల్లి రాజమౌళి, ప్రభాకర్, శ్రీనివాస్, సురేందర్, ప్రశాంత్ కుమార్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now