పాత పెన్షన్ కలపై హైకోర్టు తీర్పు… DSC 2003 ఉపాధ్యాయులకు న్యాయం..
20 ఏళ్ల నిరీక్షణకు తెర, హర్షం వ్యక్తం చేసిన టిపిటిఎఫ్ అధ్యక్షుడు చింతలలింగం.
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, జూలై 30 (ప్రతినిధి):
DSC 2003 ద్వారా ఎంపికై 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తిస్తుందన్న హైకోర్టు తీర్పుపై ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో 20 ఏళ్లుగా వేచి చూస్తున్న ఉద్యోగులకు న్యాయం జరిగిందని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక వశిష్ట డిగ్రీ కాలేజీలో నిర్వహించిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ—
2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ వెలువడినా, నియామక ప్రక్రియలో తాత్కాలిక జాప్యం వల్ల ఉద్యోగాలు ఆ తర్వాతి తేదీల్లో లభించాయన్నారు. అయినా వారిని నూతన పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లోకి చేర్చినందున అన్యాయం జరిగిందని చెప్పారు.
ఇప్పుడైతే కేంద్రం జారీ చేసిన O.M.No. 57/04/2019-P & PW (B), తేదీ 17-02-2020, మరియు తెలంగాణ హైకోర్టు W.P.No. 22559, 15644, 11398/2023పై 2025 మార్చి 19న వచ్చిన తీర్పు ప్రకారం, నియామక తేదీ కంటే ముందే నోటిఫై అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తించనుందని స్పష్టం అయిందన్నారు.
ఈ నేపథ్యంలో, DSC 2003 ద్వారా ఎంపికై 01-09-2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ స్కీమ్ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని టిపిటిఎఫ్ డిమాండ్ చేస్తోంది.
“ఇది ఉపాధ్యాయులే కాదు — న్యాయం కోసం పోరాడిన ప్రతి ఉద్యోగి విజయం”
— చింతల లింగం, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు
.