Site icon PRASHNA AYUDHAM

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి

IMG 20241220 WA0173

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం తీపి కబురు చెప్పాలి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యాంసుందర్ కి, అధికార ప్రతినిధి ఎస్ రమేష్ గారికి వినతి పత్రం అందజేత సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పై కమిటీ ఆదేశాల లో భాగంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మణుగూరు ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి, అధికార ప్రతినిధి ఎస్ రమేష్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బొగ్గు గనులలో పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని 2013లో కమిటీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ సింగరేణి వ్యాప్తంగా అవి అమలు కావడం లేదని ఫలితంగా సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న ముప్పయి వేల మంది అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు తీపి కబురు చెప్పాలని ఆయన కోరారు. అదేవిధంగా 2024 వరకు పిఎఫ్ లెక్కలు చూపాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ వర్కర్లకు కేటాయించాలని, ఓబి వర్కలను ఆపరేటర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని, పటిష్ట రక్షణ చర్యలు అమలు చేయాలని, ప్రమాదంలో మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఉపాధి కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నల్లా రమేష్ ,ఆంగోత్ మంగీలాల్, కుంట గురుమూర్తి, గోవింద నాగేశ్వరరావు, ఎస్.కె రజబ్ అలీ, ఎం గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version