Site icon PRASHNA AYUDHAM

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధ్యం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250620 205910

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున జిల్లాలోని రైతులు తమకు కావలసిన ఎరువులు విత్తనాలను విత్తన వ్యాపార లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. రైతులు సర్టిఫైడ్, ట్రూత్ ఫుల్ లేబుల్ ఉన్న విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. విత్తనాల ప్యాకింగ్ పై, ప్యాకింగ్ తేది, గడువు మూసే తేదీ, పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. పత్తి విత్తనాల గరిష్ట ధర జిల్లాలో రూ.901గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంత కంటే ఎక్కువ డబ్బులు చెల్లించొద్దని అన్నారు. పెసర, మినుము, కంది, సోయాబీన్, వరి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్ పై ముద్దరించిన గరిష్ట ధరకు మించి చెల్లించరాదన్నారు. బట్ట సంచులతో గాని, విడిగా విత్తనాలను గాని గ్రామాలలో పర్యటించే దళారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దన్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు విత్తనాలు విక్రయిస్తామంటే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు సంప్రదించాలన్నారు. లైసెన్సు ఉన్న డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదులను తీసుకొని జాగ్రత్త పరచాలన్నారు. విత్తన రసీదులను విత్తన సంచులను సంచులపై ఉన్న ట్రూత్ ఫుల్ లేబుల్ సర్టిఫైడ్ లేబుల్ లను పంట ముగిసే వరకు రైతులు జాగ్రత్తపరచాలని సూచించారు. విత్తనాలు ఎరుగుల కొనుగోలులో రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత మండలాల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని, వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ..వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించాలని ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

Exit mobile version