Headlines in English
-
Hindava Shankharavam Sabha to Be Held in Vijayawada on January 5, 2025
-
Kalyandurg Hosts Key Meeting for Hindava Shankharavam Sabha Success
-
RSS Leader Himakar Calls for Strong Action to Protect Hindu Temples
-
VHP Leaders and Hindu Community Representatives Organize for Hindava Shankharavam Sabha
-
Hindava Shankharavam Sabha: Key Organizers and Roles Announced for the Event
*కళ్యాణదుర్గం*
హైందవ శంఖారావం సభను విజయవంతం చేయండి.
2025 జనవరి 5 వతేది విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభకు సంబంధించిన పరివార సంస్థల విస్తృతస్థాయి సమావేశం కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్
విభాగ్ సంఘచాలక్ శ్రీ హిమకర్ మాట్లాడుతూ
దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, దేవాలయాలలో అన్యమతస్తుల ఉద్యోగులను తొలగించాలని, దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ దైవ భక్తులు మాత్రమే ఉండాలని, హిందూ సమాజం పై ఆలయాలపై కుట్రపూరితంగా జరుగుతున్న దాడులను ప్రభుత్వాలు గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.
పూజ ధర్మాచార్యుల ఆశీస్సులతో దేశ వ్యాప్త ఉద్యమంలో భాగంగా విజయవాడలో 05 జనవరి 2025
తేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతున్నదని లక్షలాదిగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమం యొక్క కరపత్రo ను ఆవిష్కరించడం జరిగింది.
కళ్యాణదుర్గం లో ఈ ఉద్యమ *కన్వీనర్ గా* జి వెంకటరమణ ,
*కో- కన్వీనర్లుగా* 1.వేలూరు విజయభాస్కర్ నాయుడు , 2.తలారి సోమశేఖర్ , 3.బంగారు మల్లారెడ్డి ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో VHP నేతలు మేడ నాగభూషణం , నరహరి ,శ్రీకాంత్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.