హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ శవ యాత్ర!!
ఇటీవల ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి వైఖరికి నిరసనగా రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.పాడి కౌశిక్ వెంటనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.