Headlines
-
హైదరాబాద్లో భారీ గంజాయి, డ్రగ్స్ దహనం
-
1.75 కోట్లు విలువ చేసే గంజాయి, డ్రగ్స్ను కాల్చివేసిన ఎక్సైజ్ పోలీసులు
-
621 కిలోల గంజాయి, 101 కిలోల పాపిష్ట దహనం: హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు
-
షాద్నగర్లో గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ – ఎక్సైజ్ అధికారులు పెద్ద చర్య
-
హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారంపై అగ్రగామి చర్య – ఎక్సైజ్ అధికారుల అభినందన
హైదరాబాద్లోని మూడు ఎక్సైజ్ పోలీస్ పట్టుకున్న
గంజాయి డ్రగ్స్ దహనం..
*హైదరాబాద్* ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ పరిధిలోని మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పట్టుబ డిన గంజాయి, డ్రగ్స్ను శనివారం కాల్చివేశారు.
*హైదరాబాద్* డిప్యూటి కమిషనర్ కెఏబీ శాస్త్రీ అదేశాల మేరకు షాద్నగర్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ అమోదిత మల్టీకౌవ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ లో రూ. 1.75 కోట్ల విలువ చేసే గంజాయి, డ్రగ్స్ను కాల్చివేశారు.
ధూల్పేట్, నాంపల్లి, ముషిరాబాద్ ఎక్సైజ్ పోలీస్లో 187 కేసుల్లో పట్టుబ డిన 621 కిలోల గంజాయి, 101 కిలోల పాపిష్ట, 0.4 కేజీల భంగ్, 46గ్రాముల ఎండిఎండి,108 ఎల్ఎస్డి బాస్ట్స్లను దహనం చేశారు.
డిస్పోసల్ డీడీసీ మోహన్బాబు, మూడు స్టేషన్ల సీఐలు సిబ్బంది పాల్గన్నారు.
గంజాయిని డ్రగ్స్ను డిస్పోజల్ చేసినటువంటి హైదరాబాద్ మూడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని ఎక్సైజ్ సిబ్బందిని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ విబి కమలాసన్ రెడ్డి అభినందించారు..