నేను అమాయకుణ్ని.. తప్పుడు కేసులో ఇరికించారు: జగన్
వైకాపా కార్యకర్త సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని,కేసును కొట్టివేయాలని కోరారు.
తనతో పాటు ఇతర వైసీపీ నాయకుల పిటిషన్లపై
హైకోర్టు నేడు (జూన్ 26) విచారణ చేపట్టనుంది.
ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు.